MohanPublications Print Books Online store clik Here Devullu.com

నిపా వైరస్‌ | Nipah virus | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu


నిపా వైరస్‌ | Nipah virus | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

నిపా కలవరం.. 
గబ్బిలాలు, పందులే మూలం 
కేరళలో మొదలైన ‘నిపా’ కలవరం చూసి దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిపా వైరస్‌ కొత్తదేం కాదు. కానీ ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది, పైగా సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. కేరళలో కూడా ఉన్నట్టుండి ముగ్గురు దీని కారణంగా మృత్యువాత పడటం, వీరిలో ఒక నర్సు కూడా ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు రేగుతున్నాయి. నిపా వైరస్‌ కొంత అరుదైనదేగానీ మరీ అంత కొత్తదేం కాదు. ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. జంతువులకూ, మనుషులకు కూడా జబ్బు తెచ్చిపెడుతుంది. మనుషుల్లోనైతే ప్రాణాంతకమనే చెప్పుకోవాలి. అందుకే కేరళ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది.
ఏమిటీ నిపా వైరస్‌? 

మరీ ఎక్కువగా కాకపోయినా.. గత రెండు దశాబ్దాలుగా అప్పుడప్పుడు విజృంభించి, కలవరం సృష్టిస్తున్న వైరస్‌ ఇది. దీన్ని తొలిగా 1998లో మలేషియా, సింగపూర్‌లలో గుర్తించారు. అప్పట్లో ఇది పందుల ద్వారానే వ్యాపిస్తోందని భావించారుగానీ తర్వాత దీనిపై అవగాహన మరింతగా పెరిగింది. 2004లో పశ్చిమ బెంగాల్లో ఈత, ఖర్జూర కల్లు తాగిన వారిలో ఈ వ్యాధి కనిపించింది. లోతుగా పరిశోధిస్తే  ఆ కల్లు గబ్బిలాలకు సంబంధించిన స్రావాలతో కలుషితమైందనీ, దాని ద్వారానే వ్యాధి మనుషులకు సంక్రమించిందని గుర్తించారు.   ఈ వైరస్‌ మనుషుల్లో చేరితే ఒకరి నుంచి మరొకరికి కూడా వేగంగా వ్యాపిస్తోంది.

పెద్ద సమస్య మొదడువాపు! 

నిపా వైరస్‌ బారినపడితే- జ్వరం, వాంతులు వికారం, తలనొప్పి వంటి సాధారణ వైరల్‌ జ్వర లక్షణాలే మొదలవుతాయిగానీ.. దీనితో వచ్చే పెద్ద సమస్య మెదడువాపు. జ్వరంతో పాటే వీళ్లలో తలనొప్పి, గందరగోళం, విపరీతమైన మగత, సోయి సరిగా లేకపోవటం వంటి లక్షణాలు బయల్దేరతాయి. కొందరిలో శ్వాస కష్టమవుతుంది. ఈ దశలో సరైన వైద్యం అందకపోతే కోమాలోకి వెళ్లిపోయి, వేగంగా మృత్యువాతపడతారు. ఈ జ్వరం బారినపడిన వారిలో సగటున నూటికి 70 మంది మృత్యువాతపడుతున్నారంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముందే అనుమానించటం ముఖ్యం. కేవలం లక్షణాల ఆధారంగానే దీన్ని నిర్ధారించటం కూడా కష్టం. అనుమానం బలంగా ఉంటే రక్తం సేకరించి పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ వంటి సంస్థలకు పంపిస్తే వాళ్లు పరీక్షించి నిపా వైరస్‌ ఉందేమో నిర్ధారిస్తారు.

పండ్లు కడుక్కోవాలి! 

గబ్బిలాల కొరికిన పండ్లు తినటం ఈ వైరస్‌ వ్యాప్తికి దోహదం చేసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఎలాంటి గాట్లు లేని పండ్లు ఎంచుకోవటం, వాటిని పూర్తి శుభ్రంగా కడుక్కుని తినటం ముఖ్యం. రెండోది- పందుల వంటి జంతువులకు దూరంగా ఉండటం మంచిది. ప్రస్తుతానికి ఈ సమస్య కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కనబడుతోంది.  మన ప్రాంతంలో దీని ఆనవాళ్లేం లేవు. కాబట్టి ఆందోళన అవసరం లేదుగానీ అప్రమత్తంగా ఉండటం మాత్రం చాలా అవసరం.

కల్లుపై ఆంక్షలు 

ఇప్పటికే ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న కొజికోడ్‌ తదితర ప్రాంతాల్లో ఈత, తాటి కల్లు తియ్యద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఈ గబ్బిలాలు  తాడి, ఈత చెట్ల మీద కూడా ఎక్కువగానే తిరుగుతుంటాయి, ఆ కల్లులో వీటి లాలాజలం గానీ, మూత్రంగానీ కలిస్తే దాని ద్వారా వైరస్‌ వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే వైద్యులు ఆయా ప్రాంతాల్లో కల్లు తీయొద్దని ఆదేశించారు.

నిపా వైరస్‌ | Nipah virus | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list