MohanPublications Print Books Online store clik Here Devullu.com

-జాతీయ ఐక్యతా దినోత్సవం-సర్ధార్ వల్లభాయ్ పటేల్ _National Unity Day-Rashtriya Ekta Diwas

జాతీయ ఐక్యతా దినోత్సవం
సర్ధార్ వల్లభాయ్ పటేల్ 
National Unity Day
Rashtriya Ekta Diwas






విశాల భారత విలీనాధీశుడు
ఆడంబరం లేదు. అట్టహాసాల్లేవు. ఈ గడ్డ మీద సుస్థిరంగా నిలబడి.. దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ సవిస్తారమైన జాతి నిర్మాణాన్ని సాహసోపేతంగా, అద్వితీయంగా పూర్తి చేసిన చరిత్ర పురుషుడు...
చెక్కుచెదరని ఉక్కు సంకల్పంతో.. వయోభారాన్ని లెక్క చెయ్యకుండా దేశం మొత్తం కలియదిరుగుతూ.. స్వతంత్ర మనుగడకు అడుగడుగునా అడ్డుతగులుతున్న వందలాది సంస్థానాలను విలీనాల బాట పట్టించటంలో అసాధారణమైన చతురత, విజ్ఞత ప్రదర్శించారు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌!
ఒకవైపు అందమైన దార్శనికతతో స్వతంత్ర భారత కలల సౌధాన్ని వూహిస్తూ.. అంతర్జాతీయంగా ఖ్యాతినీ, దేశ ప్రజల్లో కొంగొత్త ఆశలనూ, కొండంత స్ఫూర్తినీ నింపటంలో జవహర్‌లాల్‌ నెహ్రూ కృతకృత్యులైతే... అదే సమయంలో, ఆయన వెన్నంటే ఉండి.. అవసరమైతే విభేదిస్తూ కూడా.. వాస్తవాలను వీడకుండా.. గాలిలో మేడలు కట్టకుండా.. అట్టడుగు నుంచి జాతి సౌధానికి సుదృఢమైన, సుస్థిరమైన పునాదులు వేసిన సిసలు శిల్పి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌!
మొక్కవోని సమైక్యతా స్ఫూర్తి.. సంక్షోభాల అంచున కూడా నిబ్బరమైన నిర్ణయ శక్తి.. స్వప్నాలను సైతం సాకారం చేసే వాస్తవికమైన కార్యాచరణ.. వైరుధ్యాలను సైతం అధిగమించే సాకార సారథ్యం.. ఇవన్నీ సర్దార్‌ జాతికి అందించిన అమూల్యమైన విలువలు. ఈ దేశానికి అనవరతం అవసరమైన సుగుణగణాలు. ఆయన జయంత్యుత్సవాలను పురస్కరించుకుని.. నిర్వహిస్తున్న‘జాతీయ ఐక్యతా దినం’ సందర్భంగా ఆ మహోన్నతుడి స్ఫూర్తి నింపుకొని, ఆయన ఆజన్మాంతం నిలబెట్టుకున్న నిలువెత్తు విలువలకు మనం మరింత అంకితం కావటం మనకూ, మన భవితకూ జాతీయ అవసరం!
సమైక్యతా సార్వభౌముడు 
పుడుతూనే పుట్టెడు సమస్యలు! బ్రిటీషు పరపీడన పరాయణత్వాన్ని వదిలించుకుని.. దాస్యశృంఖలాలను ఛేదించుకుని.. స్వతంత్ర జాతిగా పురుడుపోసుకున్న భరతావనికి.. సమస్యలే స్వాగతం పలికాయి. సుదీర్ఘంగా సాగిన స్వతంత్ర సంగ్రామం.. అనూహ్యంగా వచ్చి పడిన విభజన గాయం.. వీటితోనే సతమతమవుతున్న పురిటిగడ్డకు అడుగడుగునా అడ్డుతగిలే సంస్థానాలు పెద్ద సమస్యగా పరిణమించాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఆసేతు హిమాచలం విశాల భరతావని నిండా పరచుకుని ఉన్న 565 రాజరిక సంస్థానాలను ఏం చెయ్యాలో ఎవరికీ తోచలేదు!
స్వతంత్ర భారత తొలి ఉప ప్రధానిగా, తొలి హోం మంత్రిగా ఈ సమస్యను ఒక సవాల్‌గా స్వీకరించారు ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌.
రక్తపాత రహితంగా.. ఎక్కడా స్పర్థలకు తావు లేకుండా.. సంస్థానాలన్నీ సయోధ్యతో భారత సమాఖ్యలో విలీనమయ్యేలా ఒప్పించటంలో, ఈ దేశాన్ని ఇలా ఏక ఖండంగా నిలబెట్టటంలో ఆయన సుదృఢ సంకల్పాన్నీ, అసాధారణ ప్రజ్ఞనూ కనబరిచారు.
భరత గడ్డకు స్వతంత్రం ఇవ్వాలని బ్రిటీషు పాలకులు సూత్రప్రాయమైన నిర్ణయం తీసుకున్నప్పుడు.. సంస్థానాల సమస్యను వాళ్లేమాత్రం పట్టించుకోలేదు. భారత దేశంపై తాము అనుభవిస్తున్న, ఇంకా చెప్పాలంటే తాము చెలాయిస్తున్న సర్వోన్నత అధికారాలను వదిలేసుకోవటంతోటే తమ పని అయిపోతుందని వాళ్లు భావించారు. ఈ సంస్థానాలన్నీ ఇటు భారత్‌లో, లేదంటే అటు పాకిస్థాన్‌లో కలిసి పోవచ్చనీ, ఇంకా కాదంటే స్వతంత్రంగానూ ఉండే స్వేచ్ఛ వాటికి ఉందని చెప్పిపోయారు. ఈ సంస్థానాధీశులంతా కూడా బ్రిటీషువారు వైదొలగిపోతే.. వారి సర్వోన్నత అధికార ఛత్రఛాయ తొలగిపోతుందనీ, ఇక తమ పరిపాలన తాము సాగించుకోవచ్చన్న ­హల్లో తేలియాడటం మొదలుపెట్టారు. కొందరు పాకిస్థాన్‌ పంచన చేరాలనీ పథకాలు వేస్తున్నారు.
కలగూర గంపలా...
అప్పటికే ఈ భరత భూభాగం ఎన్నో జాగీర్లు, ఎన్నో సంస్థానాలు, రాజాస్థానాలతో కిక్కిరిసిపోయింది. వీటిలో పెద్దవే కాదు, ఏమాత్రం ప్రాభవం లేని చిన్నచిన్నవీ ఎన్నో ఉన్నాయి. ఒరిస్సాలోని ఒక సంస్థానపు వైశాల్యం కేవలం 46 చదరపు మైళ్లేనంటే దేశ స్థిరత్వానికి, జాతి మనుగడకు ఇవెంత అడ్డుతగులుతాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మళ్లీ వీటి నిండా ఎన్నో అంతస్సంఘర్షణలు, కుట్రలూ, కూహకాలూ!
ఒళ్లంతా గాయాల్లా వీటన్నింటినీ ముంగిట పెట్టుకుంటే భారత స్వతంత్రానికి అర్థమే ఉండదని గ్రహించారు పటేల్‌. అప్పటికి ఆయన వయసు 72 సంవత్సరాలు. వయోభారాన్ని సైతం లెక్కచెయ్యకుండా.. ఈ తెగిపడిన పూసల్లా ఉన్న సంస్థానాలన్నింటినీ భరత మాత మెడలో దండగా గుదిగుచ్చటానికి ఒంటిచేత్తో ఆయన పడిన శ్రమ అనంతం.
ఈ విలీన క్రమంలో ఆయన ప్రదర్శించిన విజ్ఞత అపూర్వమైనది. అంతా ఆ రాజులనూ, రాజ్యాలనూ మధ్యయుగాల అవశేషాలుగా, పాతకాలపు రోతగా ఈసడించుకుంటుంటే పటేల్‌ మాత్రం వారిని మానసికంగా దూరం చేసుకునే పనులేవీ చెయ్యలేదు. వాళ్లకు ప్రాముఖ్యం ఇస్తున్నట్టే కనబడుతూ, వాళ్ల ప్రాభవం తగ్గకుండా చూస్తామని హామీలిస్తూనే వాళ్లను నయగారంగా దారిలోకి తీసుకువచ్చారు. అంతా జాగీర్దారులను- దొంగలనీ, దోపిడీదారులనీ నిరసిస్తుంటే పటేల్‌ మాత్రం వాళ్లను మరో కోణం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. దోపిడీదారులంటూ వాళ్ల జాగీర్లు లాగేసుకుని, వాళ్ల చేతిలో చిల్లిగవ్వ కూడా పెట్టకుండా పంపించేస్తే.. వాళ్లంతా మందీమార్బలంతో సహా అసాంఘిక శక్తులుగా, అరాచక మూకలుగా మారతారని, స్వతంత్ర భారతావనికి మరింత ముప్పుగా, పెద్ద తలనొప్పిగా తయారవుతారని ­హించారాయన. అందుకే వారందరికీ తగినంత పరిహారాలూ, భరణాలూ, పర్సులూ ముట్టజెప్పేలా ఒప్పందాలు కుదిర్చారు. అంతేకాదు, వారితో సానుకూలంగా వ్యవహరిస్తూ, వారిని జాతినిర్మాణంలో భాగస్వాములను చెయ్యటం దేశ భవితకు మరింత కీలకమని కూడా గ్రహించారాయన. అందుకే ఇంత పెద్ద విశాల భారతావని మధ్య స్వతంత్రంగా బతికే సాధన సంపత్తి లేదు కనక మీరంతా పరిపాలనా బాధ్యతలు వదిలేసుకుని దేశంలో విలీనమైపోవటమే మీకు శ్రేయోదాయకమంటూ నచ్చచెప్పారు. రాజ్‌ప్రముఖ్‌ వంటి బిరుదులూ, గౌరవ మర్యాదలకు భంగం లేకుండా చూస్తామనీ, భరణాలతో పాటు తాయిలాలూ, అందలాలూ కూడా ఇస్తామని ­రించారు. పరిమిత అధికారాలతో పాటు కొంత వరకూ సొంత ఆస్తులూ కలిగి ఉండొచ్చని ఒప్పందాలు కుదిర్చారు. ఒరిస్సా లాంటి చిన్న ప్రాంతంలో దాదాపు 28 సంస్థానాలున్నాయి. వాళ్ల వద్దకు వెళ్లి- ‘‘మీరంతా నూతుల్లో కప్పల్లా ఈ చిన్నచిన్న సంస్థానాల్లో ఎంతకాలం ఉంటారు? మీ రాజ్యాధికారాలను ఎంత వరకూ నిలపుకొంటారు? నేనేమీ రాజకుటుంబంలో పుట్టలేదు. కానీ ఈనాడు యావత్‌ భారత రాజ్యవ్యవస్థలో నాకు కీలక భాగముంది. కోరుకుంటే మీకూ ఇలాంటి విస్తృత అధికారాలు దక్కుతాయి’’ అంటూ విడమరిచి చెప్పారు. ఒకవైపు బుజ్జగిస్తున్నా.. సంస్థానాధీశులంతా ఆయన మాటల్లోని దృఢత్వాన్నీ, కచ్చితత్వాన్నీ గ్రహించకపోలేదు. దీంతో వారంతా మరో మార్గం లేదని గ్రహించి.. గౌరవప్రదంగానే పటేల్‌ దారికి వచ్చేశారు. పటేల్‌ వ్యూహం ఫలించింది. ఇలా ఒరిస్సా, నాగపూర్‌, సౌరాష్ట్ర, కొల్హాపూర్‌, బరోడా, రాజస్థాన్‌, మైసూర్‌.. ఎన్నో సంస్థానాలు బేషరతుగా, రక్తపాత రహితంగా భారత భూభాగంలో విలీనమైపోయారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి దేశంలోని దాదాపు సంస్థానాలన్నీ విలీనమైపోయాయి.
ఒక యజ్ఞంలా విలీనాల కోసం పటేల్‌ చేస్తున్న కసరత్తును చూసి సాక్షాత్తూ జవహర్‌లాల్‌ నెహ్రూనే.. ‘‘నేను కూడా ­హించలేదు... ఈ విలీన ఘట్టం ఇంత త్వరగా ముగుస్తుందని’’ అని ఆనందాశ్చర్యాలు ప్రకటించారు. పటేల్‌ పట్టుదల, ప్రతిభ చూసి ముగ్ధులయ్యారు.
పాలన చట్రంలో ఇమిడిపోయేలా...
విలీనాల ద్వారా దాదాపు 5 లక్షల చదరపు మైళ్ల భూభాగాన్ని, దాదాపు 8.6 కోట్ల మంది ప్రజలను భారత్‌లో కలపగలిగారు పటేల్‌. కేవలం సంస్థానాలను విలీనం చెయ్యటమే కాదు... అవన్నీ స్వతంత్ర భారత పరిపాలనా చట్రంలో ఇబ్బంది లేకుండా ఇమిడిపోయేలా చూడటం కూడా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘నిజమైన పని ఇప్పుడే మొదలైంది. శతాబ్దాలుగా దూరం జరిగిన వాటిని ఒక దరికి చేర్చటమేకాదు.. పాత వాటిని కొత్త చట్రంలోకి తీసుకువస్తూ, ఇవన్నీ కలిసికట్టుగా ఒక వ్యవస్థలో ఒదిగిపోయేలా చూడటం ముఖ్యం. ఈ పాత రాష్ట్రాల్లో మనం ఉన్నట్టుండి ఒక్క రాత్రిలో ఆధునిక పరిపాలనా వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ మార్పునకు స్ఫూర్తి కింది నుంచి కాదు, ముందు పైనుంచి రావాలి. ఈ వేళ్లు ఆరోగ్యకరంగా, బలంగా పాదుకోవాలి. అప్పుడే అది సుస్థిరంగా నిలబడుతుంది’’ అయన వ్యాఖ్యానించారు. జునాగఢ్‌, కశ్మీర్‌, హైదరాబాద్‌... ఈ మూడు సంస్థానాల విషయంలో తప్పించి మిగతా సంస్థానాలన్నింటినీ పటేల్‌ ఇలాగే విలీనం దారికి తెచ్చారు. హైదరాబాద్‌ విషయంలో సరైన సమయంలో పోలీసు చర్యకు దిగటం ద్వారా తన వ్యూహచతురతను ప్రదర్శించారు.
సంస్థానాల శాంతియుత విలీనం స్వతంత్ర భారత నిర్మాణంలో తొలి అడుగు, అతిపెద్ద అడుగు, బలమైన అడుగు కూడా. దీన్నో అద్భుతంలా సుసాధ్యం చెయ్యటంలో పటేల్‌ కృషి, దార్శనికత అనితర సాధ్యం.
సంస్థానాల విలీనం విషయంలో తరచూ వల్లభాయ్‌ పటేల్‌ను జర్మనీ ఏకీకరణ సాధించిన బిస్మార్క్‌తో పోల్చినా.. దీన్ని రక్తపాత రహితంగా సాధించటం పటేల్‌ను శిఖర సమానుడిని చేసింది. ‘‘కొన్ని వందల సంవత్సరాల నుంచీ ఈ దేశంలో వేళ్లు పాతుకుని పోయిన జమీందారీ విధానం, సామంత రాజ్యాలను ఇంత సులభంగా పెకలించవచ్చని ఎవరూ ­హించలేదు. ఆరు మాసాల క్రితం ఇలా జరుగుతుందని నేనూ అనుకోలేదు. ఇంత క్లిష్టమైన సమస్యను ఇంత సునాయాసంగా పరిష్కరించటంలో నా మిత్రుడు, సహచరుడు సర్దార్‌ పటేల్‌ చూపించిన ప్రజ్ఞ ప్రశంసనీయమైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందుకు దేశంతో పాటు మేమూ సర్దార్జీకి రుణపడి ఉన్నాం. పాకిస్థాన్‌ విడిపోగా మిగిలిన దేశాన్ని సమైక్యంగా నిలిపి ఉంచటంలో ఆయన నేర్పు, సామర్థ్యం ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి’’
- జవహర్‌ లాల్‌ నెహ్రూ
అంబేడ్కర్‌ అత్యుత్తమ వ్యక్తి
రాజ్యాంగ సభకు చెందిన అనేక కమిటీల్లో కీలక సభ్యుడి వ్యవహరిస్తూ సర్దార్‌ పటేల్‌ చేసిన కృషి నిరుపమానం. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సందర్భంగా జరిగిన ఓ చిన్న సంఘటన ఆసక్తికరం. గాంధీజీని తరచూ విమర్శించే, కాంగ్రెస్‌ను వ్యతిరేకించే అంబేడ్కర్‌ను రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా ఎందుకు నియమించారంటూ కాంగ్రెస్‌ నాయకుడొకసారి పటేల్‌ను నిగ్గదీశాడు. దీనికి పటేల్‌ సమాధానమిస్తూ... ‘‘రాజ్యాంగ నిర్మాణం అంటే మీకు ఏం తెలుసు? ఈ పనికి మేం అత్యుత్తమ వ్యక్తిని ఎంపిక చేశాం’’ అని నిర్ద్వంద్వంగా పేర్కొన్నారు.
మైనారిటీల మద్దతుండాలి
రాజ్యాంగ సభకు చెందిన అత్యంత ముఖ్యమైన అల్ప సంఖ్యాకులు, ప్రాథమిక హక్కుల సలహా కమిటీకి సర్దార్‌ పటేల్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ కమిటీకి తనను ఛైర్మన్‌గా ఎంపిక చేసిన రోజు తాను ఎంతో భయపడినట్టు పటేల్‌ చెప్పుకున్నారు. ఆ సమయానికి దేశంలో అన్ని వర్గాల ప్రజలు అపోహలు, అనుమానాలతో ఉండేవారు. ఈ క్రమంలో పరస్పర అవగాహన, సహకార స్ఫూర్తితో పటేల్‌ ఆ బాధ్యతలను నిర్వర్తించారు. అల్పసంఖ్యాక వర్గాలన్నింటి ఏకాభిప్రాయ మద్దతుతో నిర్ణయాలు ఉండాలని భావించేవారు. చివరకు రాజ్యాంగ సభ మతపరమైన అల్పసంఖ్యాకులకు ప్రత్యేక ప్రాతినిధ్యం అంశాన్ని పక్కనపెట్టడం పటేల్‌ నిష్పాక్షిక కృషికి నిదర్శనం.
అంతరాలు పూడాలి
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రక్షణలు కల్పించడంపై పటేల్‌ విస్పష్టమైన అవగాహనతో ఉండేవారు. ‘‘సమాజంలో వర్గీకరణలు, భేదాభిప్రాయాలను వీలైనంత వేగంగా రూపుమాపాలి. పౌరులందరినీ సమానత్వం స్థాయికి తీసుకురావాలి. మైనార్టీల్లో విశ్వాసం పాదుకునేలా ఔదార్యం చూపాల్సిన బాధ్యత మెజార్టీ వర్గాలదే. అలాగే మైనార్టీ వర్గాలు గతాన్ని మరచిపోవాలి’’ అని రాజ్యాంగ సభ సమావేశంలో పేర్కొన్నారు.
ఈ మొండిమనిషి ఎవర్రా?
1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశం వచ్చారు. అహ్మదాబాద్‌లోని కోచవరం వద్ద ఆశ్రమం ఏర్పాటు చేసుకొన్నారు. వల్లభాయ్‌ ఆ రోజుల్లో గాంధీ సిద్ధాంతాలను, నమ్మకాలను ఎగతాళి చేసేవారు. ‘ఆశ్రమంలో ఏముందయ్యా.. గోధుమల్లోని రాళ్లేరుకుంటూ కూర్చోవడం తప్ప.. ఈ మాత్రానికే దేశానికి స్వరాజ్యం వచ్చేస్తుందా?’ అని చులకనగా మాట్లాడేవారట. ‘‘స్వరాజ్యం ఆంగ్లేయుల దయాదాక్షిణ్యాలతో లభించేది కాదు, గుంజుకోవాల్సిందే. ఇది దేశ ప్రజల జన్మహక్కు. ఇతరుల దయాభిక్ష కోసం పాకులాడొద్దు’’ అని గాంధీజీ ప్రభోదించారు. గాంధీ మార్గం వల్లభాయ్‌ను ఆకర్షించింది. ఎక్కువకాలం దూరంగా ఉండలేక పోయారు. గాంధీజీని అనుసరించారు.
నేను మొదట వల్లభ్‌భాయ్‌ను కలుసుకొన్నప్పుడు ఈ మొండిమనిషి ఎవరా అని అనుకొన్న మాట నిజం. కానీ, కార్యరంగంలో ఆయ నను చూసిన తర్వాత మాత్రం ఇలాంటి మనిషే నాకు కావాలి అనిపించింది.’ అని గాంధీజీ తన అనుచరులతో పేర్కొన్నారు.













khaidi no150 ఖైదీ నెం 150




Chinna Jeeyar Swamy, చిన్న జీయర్ స్వామి

చిన్న జీయర్ స్వామి
Chinna Jeeyar Swamy 







త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ (చిన్న జీయర్ స్వామీజీ)తో ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ భగవద్ రామానుజస్వామి... వారిది మిలీనియమ్ మార్చ్! దళితులను గుడిలోకి తీసుకువెళ్ళారు! అతి శక్తిమంతమైన ‘నారాయణ మంత్రం’ దాచుకోకుండా పంచిపెట్టారు! పెద్ద జీయర్‌స్వామి... వీరిది ఫ్రీడమ్ మార్చ్! తన భూమినంతా దానం చేసి, స్వరాజ్యం కోసం పోరాడారు... నిరతాగ్నిహోత్రంతో... దేశమంతటా... 108 ‘శ్రీరామక్రతువు’లు చేశారు. భక్తులతో ‘రామ’కోటి రాయించి, సమతా ‘స్తూపాల’ను ప్రతిష్ఠించారు. మహానుభావులు... ‘ధర్మం’ కోసం కృషి చేశారు. చిన్న జీయర్ స్వామి... వీరిది ప్రోగ్రెసివ్ మార్చ్! వేదానికి అధ్యయన జ్యోతి... అంధులకు అక్షర కాంతి... గిరిజనులకు విద్యాక్రాంతి. భగవద్ రామానుజ, పెద్ద జీయర్ స్వాముల పరంపరకు ‘జెండాపై కపిరాజు’. మనకు తెలిసిన స్వామి... మనలో ఒకడైన స్వామి... కళ్ళతో పలకరిస్తారు... చిరునవ్వుతో సాంత్వన కలిగిస్తారు. ఊరి పెరటిలో... తులసి మొక్క... సమాజంలోని సర్వరోగాలకూ నివారిణి! వీరికి 60 ఏళ్ళు... వీరి పరంపరకు వెయ్యేళ్ళు... వీరి స్ఫూర్తి... పదికాలాలు విరాజిల్లు!! - రామ్, ఎడిటర్, ఫీచర్స్ నమస్కారం స్వామీజీ! మీకు 60 వత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా తిరునక్షత్ర మహోత్సవం చేస్తామని భక్తులు ప్రతిపాదన తెచ్చినప్పుడు ఏమనిపించింది? (సాలోచనగా ఆగి... దేహం వంక చూపిస్తూ) 60 ఏళ్ళనేది ఈ శరీరానికి గడిచాయని అంటున్నారు. నిజానికి, సన్న్యాసికి శారీరకమైన జన్మ, వయస్సు ఉండవు. సన్న్యాసం స్వీకరించినప్పటి నుంచి మరుజన్మ కిందే లెక్క. అయితే, భక్తులు ప్రేమగా చేసుకుంటామని అన్నప్పుడు కాదనడానికి మనమెవరం! అయితే ఏదైనా ఘనకార్యం సాధిస్తే, అప్పుడు ఆ ఘనకార్యానికి ఉత్సవం చేసుకోవచ్చు. అలాంటివి ఏం చేశామని! గడచిన 36 ఏళ్ళ పైచిలుకు సన్న్యాసాశ్రమ ప్రస్థానంలో అంధులకు విద్యాలయాలు, వేద పాఠశాలలు, ఆసుపత్రులు, గిరిజన విద్యాలయాల లాంటివెన్నో ఏర్పాటు చేశారు కదా! (చిరు దరహాసంతో...) అవును. కానీ, సమాజానికి చేయాల్సినది ఇంకా ఎంతో ఉంది! విదేశాలకు వెళ్ళి, వేదధర్మాన్ని ప్రచారం చేసిన తొలి జీయర్ కూడా మీరే! విదేశాలకు వెళ్ళడమే తప్పు అనుకొనే సంప్రదాయంలో అంతటి సాహసం ఎలా చేశారు? విదేశాల్లో భారతీయ ధర్మ ప్రచారానికి వెళ్ళడం వెనుక ఒక దైవికమైన ఘటన ఉంది. 1992లో, 1993లో కూడా ధర్మప్రచారానికి నన్ను విదేశాలకు రమ్మని అడిగారు. కానీ, మేము రామని చెప్పాము. 1993లో ఒక సన్నివేశం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఏడాది దీపావళి వేడుక తరువాత అర్ధరాత్రి విజయవాడ దగ్గర సీతానగరంలోని మా ఆశ్రమం నుంచి మేము ఆరాధించే కోదండ రామస్వామి విగ్రహాలు చోరీ అయ్యాయి. మూడు రోజుల పాటు ఆశ్రమంలో నిద్రాహారాలు లేవు. ఆ రాత్రి అక్కడ బీట్‌లో ఉన్న కోటేశ్వరరావు అనే ఎస్.ఐ. ఇదంతా చూసి, ‘దేవుడి విగ్రహాలు దొరికే వరకు కట్టుకున్న దుస్తులు కూడా మార్చను’ అని దీక్ష పట్టారు. నాలుగో రోజున దొంగల్ని పట్టుకున్నారు. విగ్రహాలు సాధించారు. మాకు ఆ సమాచారమిచ్చారు. అయిదో రోజున విగ్రహాలు రావడంతో, వెయ్యి కలశాలతో మా స్వామికి అభిషేకం చేసి, ఆరాధించాం. అప్పటి నుంచి ప్రతి ఏటా దానికి గుర్తుగా మా ఆరాధ్యదైవమైన కోదండరామ స్వామికి ‘సహస్ర కలశాభిషేకం’ చేస్తున్నాం. ఇవాళ్టికీ కోటేశ్వరరావు గారు ఎక్కడున్నా, ఆ రోజున ఆ కార్యక్రమానికి వస్తారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నతాధికారి. ఆయన వచ్చాక, ఆయన చేతులకు తాకించి కానీ, ఆ అభిషేక కార్యక్రమం మొదలుపెట్టం. ఈ విగ్రహాల చోరీ వ్యవహారం జరిగాక, సాక్షాత్తూ స్వామే ఎలాగూ బయటకు వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు, మనమే స్వయంగా తీసుకొని ఎందుకు వెళ్ళకూడదని అనిపించింది. అది స్వామి ఆదేశంగా భావించి, అప్పటి నుంచి ధర్మప్రచారం కోసం విదేశాలకు వెళ్ళి వస్తున్నాం. సంపన్న అమెరికా నుంచి, వర్ధమాన భారతం దాకా ప్రపంచమంతా తిరిగారు కదా! అన్నిచోట్లా సమస్యలే! అన్నిచోట్లా అశాంతే! కారణం ఏమిటంటారు? ఇవాళ శాంతి లేకపోవడానికి ప్రధాన కారణాలు... ఒకటి- ఉగ్రవాదం, రెండు - ఆర్థిక అసమానతలు. రెండూ అశాంతికి దారి తీస్తున్నాయి. ఆర్థిక అసమానతలు తొలగించాలంటే, వ్యక్తుల్లో విద్యను పెంచాలి. దిగువ వర్గాల వారు కూడా ఉన్నత వర్గాల వారితో పోటీపడేలా, వారిలో నైపుణ్యం పెంచాలి. అవకాశాలు కల్పించాలి. ఇక, ఉగ్రవాదాన్ని తగ్గించడానికి శాసనాలు, ప్రేమతత్త్వం రెండే మార్గాలు. చాలాదేశాల్లో కఠిన శాసనాలున్నాయి. కానీ, మన దేశంలో ఉన్న శాసనాల్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. అధికారంలో ఉన్నవాళ్ళు దాన్ని సరిదిద్దాలి. మరోపక్క వ్యక్తిలో తోటివారి పట్ల ప్రేమను పెంచాలి. మనమంతా సహోదరులమనే భావన కలిగించాలి. అలాంటి భావన ఇవ్వగలిగింది మన వైదిక వాఙ్మయం. ఇతర మతాల్లో, వారి గ్రంథాల్లో కూడా ఆ భావన ఉంది. కానీ వాటిని బోధించడంలో, ఆచరించడంలో వస్తున్న తప్పులు, తేడాల వల్ల కొన్నిసార్లు ఉపద్రవం సంభవిస్తోంది.

కానీ, హిందూ ధర్మంలోనూ రకరకాల శాఖలు, రూపాలు ఉన్నాయిగా!? మన ‘భగవద్గీత’ మొదలైన గ్రంథాలేవీ, ‘దైవాన్ని ఇలానే నమ్మాలి, ఇలానే పూజించాలి’ అని కట్టడి చేయడం లేదు. పరస్పర విద్వేషం చెప్పడం లేదు. భగవద్గీతలోనే పరమాత్మ ‘యాన్తి దేవవ్రతో దేవాన్...’ అని చెప్పాడు. ‘నన్ను ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలో కనిపిస్తాను’ అన్నాడు. కాబట్టి ఎన్ని రూపాలు, ఎన్ని రకాల ఆరాధనలు ఉన్నా దేవుడు ఒక్కడే! ఎవడు ఏ విధానంలో ఆరాధన చేసినా, ఫలితం పొంది తీరతాడు. మతమార్పిడి తప్పు. అందుకే, మేము ‘స్వీయ ఆరాధన... సర్వ ఆదరణ’ అని మేము చెబుతాం. వివరంగా చెప్పాలంటే, ‘నీ మతాన్ని నువ్వు ఆరాధించు. నీది కానిదేదో దాన్ని గౌరవించు, ఆదరించు!’ మన భారతదేశానికి ఇదే జీవనాడి. మన రాజ్యాంగం కూడా మత స్వేచ్ఛనిచ్చింది కదా! మతస్వేచ్ఛ నిచ్చింది. పరస్పరం గౌరవాదరాలతో బతకాలనే చెప్పింది. కానీ, అమలుపరచడం దగ్గరకొచ్చే సరికే సమస్యలు. కొన్ని వేల ఏళ్ళుగా మన పక్కనే ఏ ఆలయం ఉన్నా, మసీదు ఉన్నా, చర్చి ఉన్నా, గౌరవించి, ఆదరించిన సంస్కృతి మనది. కానీ, ఇప్పుడు కొందరు తమ మతగ్రంథాల సారాన్ని తప్పుగా బోధించడం వల్ల ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. ఈ దేశపు రాజ్యాంగాన్ని గౌరవించం కానీ, ఈ పౌరసత్వం, ఇక్కడి హక్కులు అన్నీ కావాలంటే ఎలా? మనం ముందు భారతీయులం... ఆ తరువాతే ఏమైనా! ప్రపంచంలోని ఈ సమకాలీన విషయాలు మీకెలా తెలుస్తుంటాయి? ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అవి చూసే భక్తులున్నారు. చెబుతుంటారు. మీరు కూడా టెక్నాలజీనీ, ల్యాప్‌టాప్ లాంటివి బాగా వాడతారట? (నవ్వుతూ... తల పంకించారు...) సైన్సు, మతం పరస్పర భిన్నమైనవనే వాదన గురించి ఏమంటారు? నిరూపణ జరిగిన సిద్ధాంతాలన్నీ సైన్స్ అయితే, నిరూపణ కానివి ఫిలాసఫీ అని అని కదా ప్రసిద్ధి(నవ్వులు...). అయితే, సైన్స్‌కు అందని నిజాలు చాలానే ఉన్నాయి. సైన్స్‌లో డార్విన్ పరిణామ సిద్ధాంతం లాంటివి మీరు ఒప్పుకోరని విన్నాం! పరిణామం అనేది అనివార్యం. కానీ, (నవ్వుతూ...) వాళ్ళు చెప్పే పద్ధతిలో పరిణామ సిద్ధాంతాన్ని మేము అంగీకరించం. చూడండి. మనం గింజ వేస్తే దాని నుంచి ఆకులు, కొమ్మలు, పువ్వులు, పండ్లతో చెట్టు వస్తోంది. అది పరిణామం. కానీ, ఆ గింజలో లేని ఆకు, వేరు, పువ్వు, పండు రావడం లేదు కదా! ఆ గింజలోనే అవన్నీ సూక్ష్మరూపంలో ఉన్నాయి. పరిణామంలో అవి పైకి కనిపించాయి. అంతే! సూక్ష్మరూపంలో లేనిది స్థూలరూపంలోకి రాదు. మీరు ఒకప్పుడు దైవాన్ని కూడా ఒప్పుకొనేవారు కాదట! మరి, అటు నుంచి ఇటు వైపు ప్రయాణం... (నవ్వేస్తూ...) చిన్నప్పుడు అవకాశమున్న పుస్తకమల్లా చదివేవాళ్ళం. ‘ఆంధ్రప్రభ’, ‘ఆంధ్రపత్రిక’ లాంటి వాటిల్లో వచ్చే సీరియల్స్ కాగితాలు చించి, కుట్టుకొని, బైండ్ చేయించుకొని సేకరించిపెట్టేవాళ్ళం. అలా చాలా కథలు చదివాం. ‘ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’ లాంటి అనువాద సాహిత్యం చాలా చదివాం. అలా చదివిన సాహిత్యంతో లోలోపల అనేక ప్రశ్నలు వస్తుండేవి. వాటికి సమాధానాల కోసం అన్వేషిస్తుండేవాళ్ళం. అవన్నీ మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు వచ్చాక, తీరాయి. తెనాలి దగ్గర నడిగడ్డపాలెంలో గురువులు గోపాలాచార్యుల వద్ద మాకు వేదాంత గ్రంథాల బోధన జరిగింది. గోపాలాచార్యులు, మా పెద్ద స్వామి వారు సహాధ్యాయులు. కలసి వేదాంత ప్రచారం చేశారు. స్వామి వారు ఊరూరా తిరుగుతూ క్రతువులు చేస్తుంటే, గోపాలాచార్యుల వారు నడిగడ్డపాలెంలోని ఆశ్రమంలో ఉంటూ, అందరికీ వేదాంత శిక్షణనిచ్చేవారు. మేమూ అక్కడ కొన్నాళ్ళు ఉండి, అవి అధ్యయనం చేశాం. అలా పూర్తిగా ఇటువైపు వచ్చాం. స్వామీజీ! ఒకప్పుడు మీలో మార్క్సిస్టు భావాలుండేవనీ, ఆ పుస్తకాలు చదివేవారనీ... (మళ్ళీ నవ్వేస్తూ...) అవన్నీ ఒకప్పటి సంగతులు. ఇప్పటికీ సమాజసేవ, దిగువ వర్గాల అభ్యున్నతి లాంటి విషయాల్లో మీది వామపక్ష భావజాలమేనేమో... (నవ్వులు...) సమాజం మన శరీరం లాంటిది. ఇందులో ఏ అంగం ఎక్కువ, ఏది తక్కువ అంటే ఏం చెబుతాం! సమాజంలో అన్ని వర్గాలూ ఒకదానికొకటి సహకరించుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా ఒకరు, మరొకరిని అణచివేస్తానంటే ఎలా? అదే సమయంలో అందరూ పనిచేయాలి. చేసేవాడు చేస్తూ ఉంటే, తిని కూర్చొనేవాడు కూర్చుంటానంటే కుదరదు. పనిచేయడానికి బద్ధకించేవాణ్ణి పనిచేసేవాడిగా మార్చాలి. అందుకని ప్రతి ఒక్కరిలో నైపుణ్యం పెంపొందింపజేయాలి. ఉన్నత వర్గాలతో పోటీ పడేలా దిగువ వర్గాలకీ అవకాశం కల్పించాలి. వారిని తీర్చిదిద్దాలి. దీన్ని కేవలం వామపక్షం, వామభావజాలం అంటే ఎలా? నిజానికి, ఇది ప్రతి ఒక్క వ్యక్తి కర్తవ్యం అంటాను. అయితే, అదే సమయంలో - నైపుణ్యం లేకపోయినా 20 మార్కులతో పాస్ అయిన వ్యక్తిని విమానానికి పైలట్‌గానో, అల్లోపతి డాక్టర్‌గానో పెడితే... వాట్ హ్యాపెన్స్ టు ది క్వాలిటీ ఆఫ్ దిస్ కంట్రీ? మొత్తం సమాజమే నష్టపోతుంది. అసమర్థుడైన వ్యక్తిని ఆపరేషన్‌కి డాక్టర్‌గా పంపిస్తే ఏమవుతుందో ఊహించుకోండి! అన్నట్లు... మీరు కూడా మంచి వైద్యులట! మంచి మందులిస్తారట! (నవ్వేస్తూ...) హోమియో వైద్యం నేర్చుకుంటున్నా. మందులు ఇస్తుంటా. మీ తాత గారు, తండ్రి గారిలా వైద్యవిద్య వంశపారంపర్యంగా వచ్చినట్లుందే! పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారు ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు. ఇక మాకు జన్మనిచ్చిన తండ్రి గారు ఆ రోజుల్లోనే చెన్నైలో చదువుకొన్న ఎల్.ఐ.ఎం (లెసైన్స్‌డ్ ఇండియన్ మెడిసిన్) డాక్టర్. ఇద్దరూ వైద్యంలో దిట్టలే! కానీ, ఇవాళ మనం డాలర్ల జబ్బును రూపాయలిచ్చి కొనుక్కుంటున్నాం. ప్రతిదీ ఖరీదై, అల్లోపతి వైద్యం సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతోంది. ఈ పరిస్థితుల్లో అది మాత్రమే పద్ధతి కాదు, ఇంకో పద్ధతి ఉందంటూ వచ్చిన హోమియోపతి మంచి ప్రత్యామ్నాయం. సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశ పరిస్థితికి శ్రమ, ఖర్చు తక్కువైన ఈ వైద్యవిధానం బాగా సరిపోతుంది. రోగి లక్షణాలు సరిగ్గా తెలుసుకొని ఔషధమిచ్చే మంచి వైద్యుడుంటే మందు అద్భుతంగా పనిచేస్తుంది. అయితే, దీన్ని కూడా వ్యాపారంగా మారుస్తున్నవారు లేకపోలేదు. అందుకనే, అందరికీ ఈ వైద్యం అందుబాటులోకి రావాలని ‘ఇంటిగ్రేటివ్ సిస్టమ్’లో మా శంషాబాద్ ఆశ్రమంలో ‘జిమ్స్’ హోమియో కాలేజ్, ఆసుపత్రి నడుపుతున్నాం. అంటే, ఇటు ప్రజల శారీరక ఆరోగ్యం, అటు ఆధ్యాత్మికతతో మానసిక ఆరోగ్యం రెండూ మీరు చూస్తున్నారన్న మాట! (నవ్వుతూ...) అంతే అనుకోవచ్చు! కానీ, సన్న్యాసంలో ఉంటూ సామాజిక సంస్కరణ, సముద్ధరణ చేయడమెలా వచ్చింది? వెయ్యేళ్ళ క్రితం రామానుజాచార్యులూ ఇదే చేశారు. ఆయన కేవలం ఆధ్యాత్మిక నాయకులే కాదు. ఆ రోజుల్లోనే అందరి మోక్షం కోసం గోపురమెక్కి, ‘తిరుమంత్రం’ ఎలుగెత్తి చాటిన సామాజిక సంస్కర్త. ఆయన స్ఫూర్తితో వచ్చిన మా పెద్ద స్వామి వారైతే స్వాతంత్య్ర సమరయోధులు. దేశం కోసం పోరాడారు. ఆ రోజుల్లోనే ప్రజల బాగు కోసం గ్రామాలు పట్టుకు తిరిగారు. సొంత భూములు హరిజనులకిచ్చి, వారి ఉద్ధరణకు కృషి చేశారు. స్త్రీలు ఘోషాలో ఉండే ఆ రోజుల్లోనే భార్యకు రాట్నం మీద నూలు వడకడం నేర్పించి, ఆ నూలు దుస్తులు భుజాన వేసుకొని, ఊరూరా పంపిణీ చేసేవారు. దుర్భిక్ష సమయంలో పొలాల్లో తిరిగి, ఎకరానికి ఒక కట్ట చొప్పున గ్రాసం తీసుకొని, పశువులకు మేత పెట్టేవారు. సన్న్యాసాశ్రమం స్వీకరించాక కూడా ఆయన సామాజిక ఉద్ధరణ మార్గంలోనే వెళ్ళారు. మాది కూడా ఆ బాటే! ఇన్నేళ్ళ ఈ బాటలో... ఈ షష్ట్యబ్ది పూర్తివేళ మీరు స్మరించుకోవాల్సిన వ్యక్తులంటే..? (ఆసనంలో ఒక్కసారి వెనక్కి వాలి... దీర్ఘంగా శ్వాస విడుస్తూ...) చాలామంది ఉన్నారు. జన్మనిచ్చిన తల్లితండ్రులు, గురువులు, మా పెద్ద స్వామి వారు, మేము ఈ స్థితికి చేరడానికి కారణమైన వ్యక్తులు, ఈ ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు, తీర్చిదిద్దిన వ్యక్తులు, కలసి ప్రయాణించిన, ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. రాజమహేంద్రిలో స్కూలులో చదువుకుంటున్నప్పుడు ‘నారాయణా! నువ్వు తెలివిగలవాడివి. నీకు పాతికకి పాతిక మార్కులు వేస్తే, కొమ్ములొస్తాయిరా’ అంటూ, అంతా సరిగ్గా రాసినా లెక్కల్లో కూడా ఇరవై అయిదుకి ఇరవై నాలుగున్నర మార్కులే వేసిన మా మాస్టారిని స్మరించుకోవాలి. ‘ప్రపంచం గురించి చెప్పి, ఇలా ఉండాలి సుమా’ అని చెప్పిన మార్క్సిస్టు మిత్రులున్నారు. చిన్నప్పటి నుంచి మాలో ఒక క్రమశిక్షణ నేర్పిన రామచంద్ర అనే ఆర్.ఎస్.ఎస్. కుర్రాడు ఉన్నాడు. పొట్టకూటి కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు జీవితమంటే ఎలా ఉంటుందో నాకు నేర్పిన అనుభవాలున్నాయి. ఇలా ఎందరో, ఎన్నెన్నో!

ఆ పూర్వాశ్రమ జీవితంలో ఎదురైన అనుభవాల వివరాలు ఏమైనా...! అప్పట్లో మేము సికింద్రాబాద్‌లో క్యారవాన్ దగ్గర ఉండేవాళ్ళం. కోఠీ వైపు వెళ్ళాలి. పురానాపూల్, అఫ్జల్‌గంజ్, ఘోషామహల్ పక్క నుంచి వెళుతుండేవాళ్ళం. పైసా.. పైసాకి కష్టపడుతూ, కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్ళిన రోజులు గుర్తే! ఒకసారి కష్టపడి ఒక సైకిల్ కొనుక్కున్నాం. కానీ, కొన్న మూడో రోజునే దాన్ని ఎవరో పట్టుకుపోయారు. అదంతా జీవితంలో ఒక దశ. సామాన్య ప్రజల కష్టాలన్నీ స్వయంగా చూశాం, అనుభవించాం. మరి, ఆధ్యాత్మిక విద్యకు ముందు అప్పట్లో మీరు చదివిన లౌకికమైన చదువులు... ఆ రోజుల్లో ఆంధ్రా యూనివర్సిటీ మెట్రిక్యులేషన్ చదివాం. ఆ తర్వాత పై చదువుల కోసం ప్రయత్నించినా, ఎప్పుడూ ఏదో ఒక ఆటంకం వచ్చేది. పరీక్షలకు హాజరు కాలేకపోయాం. టైప్, షార్ట్‌హ్యాండ్‌ల్లో హయ్యర్ పాసయ్యాం. మా పెద్ద స్వామి (పెద్ద జీయర్ స్వామి) వారి దగ్గరకు చేరినప్పుడు ‘ఆలయాల జీర్ణోద్ధరణ కమిటీ’ తరఫున మేము అన్ని రకాల క్లరికల్ జాబ్స్ చేసేవాళ్ళం. లెక్కలు, స్టేట్‌మెంట్స్ తయారుచేసేవాళ్ళం. స్వామి వారి దగ్గరకు వచ్చాక అంతకు ముందు మాకున్న అనేక సందేహాలు తీరాయి. మళ్ళీ మా మనసు మారకుండా ఉండడం కోసం మా సర్టిఫికెట్‌లన్నీ మేమే చింపేశాం. మీరు అమెరికన్ యాసలో మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు. రష్యన్ కూడా నేర్చుకున్నారట! (నవ్వుతూ...) పూర్వాశ్రమంలో హైదరాబాద్‌లోనే ‘సీఫెల్’ (ఇప్పటి ‘ఇఫ్లూ’)లో సరదా కోసం చదివాం. కానీ, ఆశ్రమజీవితంలోకి వచ్చినప్పుడు ఆ కఠోర దీక్ష, క్లిష్టమైన వేదాంత విద్య ఎలా అలవడ్డాయి? ఒక రకంగా నన్ను మా పెద్ద స్వామి వారి పాదాల దగ్గరకు చేర్చింది మా తల్లి గారే! ‘నీకు ఏది మంచిదో వారు నిర్ణయిస్తారు’ అన్న ఆమె మాట! భగవత్ కృప వల్ల చిన్నప్పటి నుంచి అనుకున్నది ఎలాగైనా పూర్తి చెయ్యాలనే మనస్తత్త్వం, పట్టుదల అలవడ్డాయి. అప్పట్లో ఒకసారి పెద్ద స్వామి వారి క్రతువు కోసం కొన్ని మూర్తులు అవసరమయ్యాయి. కాకినాడ నుంచి రాజమండ్రికి వెళ్ళి, అందించి వచ్చే పని నాకు అప్పగించారు. తీరా నేను బయల్దేరితే రైలు మిస్సయింది. బస్సు మిస్సయింది. కానీ, ఆయనకు అవి ఇచ్చే రావాలి తప్ప, ఇంటికి వెనక్కి రాకూడదనే పట్టుదల నాది. అప్పటికి ఈ తరం పిల్లల్లాంటి లోకజ్ఞానం కూడా లేని పల్లెటూరి బైతులం మేము. అయినా సరే, సామర్లకోట దాకా బండిలో, తరువాత మరో వాహనంలో, ఆ పైన నడక... ఇలా ఎట్టకేలకు తెల్లవారు జామున పెద్ద స్వామి వద్దకు చేరాం. అనుకున్న ముహూర్తానికి అన్నీ సక్రమంగా అందించగలిగాం. ఆ తరువాత ఈ ఆశ్రమజీవితంలోకి వస్తున్నప్పుడు కూడా వేద, వేదాంత విద్యల అధ్యయనంలోనూ అదే పట్టుదల. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో చుండూరు ఘటన, తిరుమలలో వెయ్యికాళ్ళ మండపం లాంటి కొన్ని సందర్భాల్లో మీ వ్యాఖ్యలపై వివాదాలు, విమర్శలు వచ్చినప్పుడు ఏమనిపించేది? అప్పట్లో చుండూరు ఘటనలో వాస్తవాన్ని వెలికితీసి చెప్పడానికే మాట్లాడాను. ఇతరులు చాలామంది, చివరకు మీడియా కూడా వెనుకంజ వేస్తుంటే, చుండూరులో జరిగింది కేవలం రెండు వర్గాల మధ్య ఘర్షణ కాదు... అది మతసంబంధమైన ఘర్షణ కూడా అని వాస్తవం చెప్పాం. అప్పట్లో ఒక ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ విలేఖరి వచ్చి, నాతో అన్నీ మాట్లాడారు. కానీ, పత్రికలో మాత్రం వాస్తవాన్ని కాస్తంత దాచిపెడుతూనే రాశారు. మీడియా కూడా ఉన్నది ఉన్నట్లు రాయడానికి ధైర్యం చేయలేదు. కానీ, మేము మాత్రం సత్యమే చెప్పాను. చివరకు తిరుమలలో వెయ్యి కాళ్ళ మండపం విషయంలో కూడా! మేము ఎప్పుడూ ఎవరికీ అన్యాయం చేయలేదు. క్రమాన్నీ, ధర్మాన్నీ తప్పి ప్రవర్తిస్తున్నప్పుడు, మనం మాట్లాడకపోతే తప్పు అవుతుంది. మిగతావాళ్ళకు సాహసం లేదు. మేము విమర్శల్ని పట్టించుకోకుండా, వాస్తవం మాట్లాడాల్సిన కర్తవ్యం నిర్వర్తించాం. అంతే!

సమాజోద్ధరణ ధ్యేయమైన మీ లాంటి కొందరిని మినహాయిస్తే, ఇవాళ అసలు ‘గాడ్’కన్నా‘గాడ్‌మన్’ల హవా ఎక్కువైందని ఒక విమర్శ! నిజమే. దానికి కారణం - దైవాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, ఒక శాస్త్రీయమైన అధ్యయన ప్రక్రియ లేకుండా కొందరు ఒక స్థానంలో కూర్చోవడమే! అధ్యయనం లేకుండానే ఒక పీఠంపై కూర్చొన్నప్పుడు, వేలమంది వచ్చి మొక్కుతూ ఉంటే, తెలియని ఉద్ధతి, గర్వం వస్తాయి. మనకు తెలియకుండానే రెండు, నాలుగు, ఎనిమిది, పదహారు - ఇలా కొమ్ములు మొలుస్తాయి. అందుకే, ఎప్పుడూ అవి లేకుండా, రాకుండా అధ్యయనం చేస్తూనే ఉండాలి. అది మా పెద్ద స్వామి వారు చెప్పిన మాట! ఒకసారి ఆ గర్వం వస్తే అందరూ మన మాటే వినాలనుకుంటాం. కాదని ఎవరైనా అంటే, వారి మీద కసి, కోపం పెరుగుతాయి. దాంతో, ఏదో అంటాం. ఇవన్నీ అధ్యయనం, వినయం లేకపోవడం వల్ల వచ్చే పర్యవసానాలు. రోజూ తెల్లవారు జాము నుంచి రాత్రి దాకా మానవ సేవ, మాధవ సేవ, భక్తజనం మధ్య ఉండడంతో, మాకైనా అధ్యయనానికి తీరిక దొరకదు. కానీ, అధ్యయనం చేయాలి. మానకూడదు. వేదకాలం నుంచి ఉన్నత స్థితిలో ఉన్న స్త్రీ ఇవాళ్టి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? స్త్రీలను గౌరవించడం మనందరి విధి. వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే సమాజానికి క్షేమం. అందుకే, ‘ఉమెన్స్ హెల్త్ కేర్’ అనే ప్రాజెక్ట్ పెట్టాం. ఇవాళ స్త్రీలలో ఎక్కువ మందిని బాధిస్తున్నవి - సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్. వీటి పట్ల స్త్రీ మూర్తుల్లో చైతన్యం కలిగిస్తూ, వాళ్ళకు ఉచితంగా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేస్తున్నాం. ఇప్పటి దాకా తెలుగు నేలపై 5 లక్షల 25 వేల మందికి ఉచితంగా ఈ స్క్రీనింగ్ చేశాం. ఇక, స్త్రీల ప్రవర్తన విషయానికి వస్తే ఆధునిక తరంలో ధర్మం పట్ల లక్ష్యం తక్కువవుతోంది. తమిళనాడు, ఉత్తరాది లాంటి చోట్ల స్త్రీలలో ధర్మం పట్ల జాగృతి కాస్త ఉన్నా, మన తెలుగు నేలపై ధర్మం పట్ల సుముఖత తగ్గుతున్నట్లుంది. వేదాలు, ఆగమాలు చదివిన పురోహితుల్ని పెళ్ళి చేసుకోవడానికి పిల్లలు, పిల్లనిచ్చేవారు సిద్ధంగా లేరంటే ఏమనాలి? అందరూ సాఫ్ట్‌వేర్ వరుల వెంటపడుతున్నారు. నిజానికి, స్త్రీలు ఇవాళ విద్యలో, సహనంలో, కృషిలో చాలా ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి, ఇక వారిలో మనది ఈ జాతి, మనది ఈ ధర్మం, మనది ఈ సంప్రదాయం అనే భావన కలిగించాల్సి ఉంది. అందు కోసం కృషి చేస్తున్నాం. మరోపక్క, స్త్రీని కేవలం ఒక భోగవస్తువుగా చూసే పురుషులూ ఇవాళ ఎక్కువయ్యారేమో? నిజమే. అది కూడా మన విద్యావిధానంలోని లోపమే. వ్యక్తిని వ్యక్తిగా చూడాల్సిన విజ్ఞత నేర్పాల్సింది విద్యే కదా! కానీ, పిల్లలకు మంచి చెడు చెప్పే తీరిక, మన సంస్కృతి, సంప్రదాయం నేర్పే ఓపిక తల్లితండ్రులకు లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయే సరికి, పిల్లలకు అవన్నీ నేర్పే తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలు ఇంట్లో లేరు. ఎంతసేపూ చదువులు, మార్కుల మీదే శ్రద్ధ. విద్య సంస్కారాన్ని కలిగించాల్సింది పోయి, సంస్కారాన్ని తొలగిస్తోంది! ఇప్పటికే జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఒక తరం నష్టపోయింది. దాని ప్రభావమే స్త్రీల పట్ల చులకన భావం. అందుకే, ఇప్పటికైనా మనం మేల్కోవాలి. పిల్లల్లో మన ధర్మం మీద శ్రద్ధ, రుచి కలిగించాలి. వాళ్ళను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. మరి, అందుకు ఏం చేయాలంటారు? పెద్దలకూ, పిల్లలకూ మన సంస్కృతి, సంప్రదాయాలు తెలియాలి. మన దేశ ఘనచరిత్రకు ప్రతిరూపాలైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలెన్నో ఉన్నాయి. కానీ, జీర్ణోద్ధరణ అనో, సుందరీకరణ అనో పేరు పెట్టి, వాటి రూపాన్ని మార్చకూడదు. శంకరాచార్యులు, రామానుజాచార్యుల కాలం నాటి నిర్మాణాలున్నాయి. వేదవ్యాసుడు తిరుగాడిన బదరికాశ్రమం లాంటివి ఉన్నాయి. ఆ ఆశ్రమ ప్రాంతానికి వెళితే, కొన్ని వేల ఏళ్ళ నాటి మన జాతి చరిత్ర తెలిసి, మనకు పెద్ద అండ వచ్చినట్లవుతుంది. మన దేశాన్నీ, శ్రీలంకనూ కలుపుతూ సముద్రంలో శ్రీరామచంద్రుడు నిర్మించిన ‘నల సేతు’ ఇప్పటికీ ఉందని ‘నాసా’ వారి ఉపగ్రహ ఫోటోలు చూపిస్తున్నాయి. ఇవాళ్టికీ దర్భశయనం దగ్గరకు వెళితే 6 అడుగుల లోపల నీటిలో ఆ సేతువు రూపం కనిపిస్తుంది. మేము చూశాం. రామాయణ కాలం నాటి ఆ వారధిని కాపాడుకొంటే, మనం అక్కడకు వెళ్ళినప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల వెనక్కి మానసికంగా వెళతాం. మనలో హనుమంతుడి అంత శక్తి వస్తుంది. ఇంత చరిత్ర, వారసత్వం ప్రపంచంలో మన భారత జాతికి తప్ప మరొకరికి లేదు. జనంలో ఈ చైతన్యం తేవాలి. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేళ మీరు చేపట్టిన ‘సమతామూర్తి స్ఫూర్తికేంద్రం’అలాంటిదేనా? అవును. విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసిన భగవద్ రామానుజాచార్యులు 1017లో జన్మించి, 120 ఏళ్ళు కృషి చేశారు. ఆయన కేవలం మతాచార్యులే కాదు, దిగువ వర్గాల సముద్ధరణకు కృషి చేసిన సాంఘిక సంస్కర్త. ఆయన సహస్రాబ్ది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. ‘జీయర్ ఇన్‌టిగ్రేటెడ్ వేదిక్ అకాడెమీ’ (జీవా)కు అనుబంధంగా 45 ఎకరాల్లో 216 అడుగుల ఎత్తై రామానుజాచార్యుల వారి పంచలోహ మూర్తి నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే 2017లో ఈ పాటి కల్లా దాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నం. ఇంకా, 108 దివ్యదేశాలు, వైదిక ధర్మ ప్రదర్శనశాలల నిర్మాణం కూడా చేస్తాం. విజయవాడ, సీతానగరం దగ్గర కొండ మీద 108 అడుగుల మరో భారీ విగ్రహం పెట్టాలని కూడా యోచన. అంతా భగవత్ సంకల్పం! ఇన్నేళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో మీకు తృప్తినిచ్చిన విషయం? ఇవాళ్టికీ గ్రామాలకు వెళ్ళి, వాళ్ళకు ఏదైనా చెబితే చక్కగా వింటారు. అర్థం చేసుకుంటారు. ఆచరిస్తారు. అలా గ్రామ గ్రామానికీ వెళ్ళి, మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ, సమాజ ఉద్ధరణకు పాల్పడడం బాగుంటుంది. మరి, మీరింకా చేయాలని అనుకుంటున్నవి? మనం చేయగలిగినవి, చేయాల్సినవి, జరగాల్సినవి (చేతులు చాచి చూపిస్తూ...) బోలెడన్ని ఉన్నాయి! ఇప్పటి దాకా చేసింది కేవలం సముద్రంలో నీటిబొట్టే! చివరిగా, ఈ దీపావళి పండుగ వేళ ప్రజలకు మీరిచ్చే సందేశం? ఇవాళ చుట్టుపక్కల నుంచి దేశానికి అభద్రత పెరుగుతోంది. ఇలాంటి సమయంలో దేశ భద్రతకు సరైన చర్యలు చేపట్టే ప్రభుత్వం కేంద్రంలో ఉంది. ఆ రకంగా ప్రజలకు అదృష్టకాలం వచ్చింది. ప్రజలంతా ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క రూపాయి మన సైనిక సంక్షేమ నిధికి ఇచ్చినా, అది కొన్ని వందల కోట్ల నిధిగా మారి, దేశ భద్రతకు పనికొస్తుంది. దేశానికి నిప్పు పెట్టే స్థితి కొంతైనా అడ్డుకుంటాం. ఈ ఉద్యమంలో కుల, మత, జాతి విచక్షణ లేకుండా భారతీయులందరూ పాల్గొనాలి. ఒక భారతీయ హిందువుగా, ఒక భారతీయ ముసల్మానుగా, ఒక భారతీయ క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరం మన భారతదేశ భద్రతకు తోడ్పడాలి. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరివి ఏమైనా, భారతదేశమనే ఈ గృహరక్షణ మనందరి ప్రథమ కర్తవ్యం కావాలి. దానికోసం సమాయత్తం కావాల్సిన సమయం ఇదే. అది చేయడమే నిజంగా మనకు దీపావళి. - డాక్టర్ రెంటాల జయదేవ టాగ్లు: chinna jeeyar swamy, Inspiration, Society, Veda, Worship, చిన్న జీయర్ స్వామి, స్ఫూర్తి, సమాజం, వేదం, ఆరాధన87.


mohan publications price list