MohanPublications Print Books Online store clik Here Devullu.com

కార్తీకపురాణం_30 రోజుల పారాయణ గ్రంథం_Kartika Puranam_30 Days Parayana





శ్రీ నోరిభోగీశ్వర శర్మ సంకలనం చేసిన ఈ పుస్తకంలో కార్తికమాస మహిమ తెలియజేయబడింది. కార్తీకమాస స్నానము - వ్రతము, కార్తీక సోమవార వ్రత ప్రభావము, కార్తీక వ్రత మహిమ, కార్తీక దీపదాన మహిమ, కార్తీక పురాణ శ్రవణ మహిమ, మోక్షము పొందిన వితంతువు గురించి తెలియజేయబడింది. నారాయణ నామ మహిమ, అజామీళుని వృత్తాంతం, నాగేశ్వర శర్మ వృత్తాంతం, సాలగ్రామ మహిమ వివరించబడ్డాయి. వృషోత్సర్జన ప్రభావం, వనభోజనము దీపారాధన విధులు, కార్తీకంలో కన్యాదాన ఫలము గురించి రచయిత తెలిపారు. ఇంకా పురంజయుడు వృత్తాంతం, అంబరీషుని కథ, మంచి కర్మల గొప్పదనము తెలియజేయబడ్డాయి. కార్తీక పురణా శ్రవణ ఫలం గురించి వివరించారు.



పర్వదినాల పవిత్రమాసం 'కార్తీకం'

పౌర్ణమినాడు కృత్తికా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమనిపేరు. అటు హరికి, ఇటు హరుడికి, మరోపక్క వారిద్దరితనయుడైన అయ్యప్పకి కూడా ప్రీతికరమైన మాసమిది. హరిహరులిద్దరూ పరస్పరం అభిమానించుకుంటారు, ఆరాధించుకుంటారు, పూజించుకుంటారు. హరిపూజ హరునికి ఇష్టమైతే, శివపూజ కేశవునికి ప్రీతికరం. తులసీ పూజలు, వన భోజనాలు, సమారధాలు, ఉపవాసమలు, అభిషేకాలు, సహస్రనామ పారాయనలతో మార్మోగుతూ ఎంతటి నాస్తికుడైనా ఆస్తికభావానాలు కలుగజేసే మాసమిది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఈ మాసంలో ముప్పై రోజులు పర్వదినాలే..!

పాడ్యమి: కార్తీక శుద్ధ పాడ్యమి... తెల్లవారుజాముననే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయనికెళ్ళి, 'నేను చేయదలచిన కార్తీక వ్రతం నిర్విజ్ఞానం గా సాగేతట్లు అనుగ్రహింపు'మని ప్రార్దించి సంకల్పం చెప్పుకుని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి.
విదియ: ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళు ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి.
తదియ: ఈనాడు పార్వతీదేవికి కుంకుమ పూజ చేయించుకుంటే స్త్రీలకు సౌభాగ్య సిద్ది కలుగుతుంది.
చవితి: కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రమంఎస్వర స్వామికి పుట్టలో పాలు పోయాలి.
పంచమి: దీనినే జ్ఞాన పంచమి అని కూడా అంటారు. ఈరోజు శుభ్రమంఎస్వర స్వామీ ప్రీత్యర్ధం అర్చనలు, అభిషేకాలు, చేయించుకున్నవారికి జ్ఞానవ్రుద్ది కలుగుతుంది.
షష్టి: నేడు బ్రహ్మచారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాదులతో సహా ఎర్రగళ్ళ కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది.
సప్తమి: ఈరోజు ఎర్రవస్త్రంలో గోదుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్షు వృద్ది అవుతుందని శాస్త్రోక్తి.
అష్టమి: ఈ గోపాష్టమి నాడు చేసే "గోపూజ" విశేష ఫలితాలనిస్తుంది.
నవమి: నేటినుండి మూడురోజులపాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. ఈరోజ రాత్రి విష్ణుపూజ చేయాలి.
దశమి: నేడు విష్ణు సహస్రనామ పారాయణ చేసి, గుమ్మడికాయను, ఉసిరికాయను దానం చేయాలి.
ఏకాదశి: ఈ ఏకాదశికే భోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణుపూజ చేసిన వారికి ఉత్తమగతులు కలుగుతాయి.
ద్వాదశి: ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి. నేటి సాయంకాలం తులసికోటలో ఉసిరి కొమ్మను ఉంచి తులసికీ, ఉసిరికీ కళ్యాణం చేయించటం సకల పాపాలని క్షీణింప జేస్తుందని ప్రతీతి.
త్రయోదశి: ఈరోజు సాలగ్రామ దానం చేయటం వల్ల సకల కష్టాలు దూరమౌతాయని శాస్త్రోక్తి.
చతుర్దశి: నేడు శనైశ్చర ప్రాత్యర్డం ఇనుము, నువ్వులు, పత్తి, మినుములు, మొదలైన వాటిని దానం చేయటం వల్ల శని సంతృప్తి చెంది శుభ దృష్టిని ప్రసాదిస్తాడు.
పౌర్ణమి: కార్తీక పూర్ణిమ, మహాపవిత్రమైన ఈరోజు నదీస్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ darshanam చేసుకోవడం వల్ల పాపాలనీ పటాపంచలౌతాయి.
పాడ్యమి: (కార్తీక బహుళ పాడ్యమి)  ఈరోజు ఆకుకూర దానం చేయడం శుభదాయకం.
విదియ: వనభోజనం చేయటం విశేష ఫలాలనిస్తుంది.
తదియ: పండితులకు, గురువులకు తులసీమాలను సమర్పించటం వల్ల తెలివితేటలు వృద్ది అవుతాయి.
చవితి: పగలంతా ఉపవాసముండి, సాయంత్రం వేల గణపతిని గారిక తో పూజ చేసి, ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పడుకుటే దుస్వప్న దోషాలు పోయి సంపదలు కలుగుతాయి.
పంచమి: ఈరోజు చీమలకు నూకలు చల్లటం, శునకాలకు అన్నం తినిపించటం శుభ ఫలితాలనిస్తుంది.
షష్టి: గ్రామదేవతలకు పూజచేయటం వల్ల వారు సంతుష్టులై, ఏ విధమైన కీడు కలుగకుండా కాపాడుతారు.
సప్తమి: జిల్లేడు పూలతో గుచ్చిన దండనీ ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ది చెందుతాయి.
అష్టమి: కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి, కాలభైరవానికి (కుక్కకు) సమర్పించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది.
నవమి: వెండి లేదా రాగి కలశం లో నీరు పోసి పండితునికి/బ్రాహ్మణునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు.
దశమి: నేడు అన్నసంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై, కోరికలు తీరుతాయని పురాణోక్తి.
ఏకాదశి: ఈనాటి విష్ణ్యాలయం లో దీపారాదన, పురాణ శ్రవణం, పటనం, జాగరణ మున్నగునవి విశేష ఫలదాయకం.
ద్వాదశి: అన్నదానం లేదా స్వయంపాకం సమర్పించటం శుభప్రదం.
త్రయోదశి: నవగ్రహారాదన చేయటం వల్ల గ్రహదోషాలు తోలుగుతాయి.
చతుర్దశి: ఈమాస శివరాత్రినాడు ఈస్వరర్చన, అభిషేకం చేయటం వల్ల అపంరుత్యుదోశాలు, గ్రహబాడలు తొలగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులౌతారని పురాణోక్తి.
అమావాస్య: ఈరోజు పిత్రు దేవతల సంతృప్తి కొరకు ఎవరినైనా పిలచి వారికి భోజనం పెట్టాలి.లేదా పండితులకు, బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వాలి. పగలు ఉపవాసం ఉండటం మంచిది. శివకేశవ ప్రీత్యర్డం దీపారాదన చేసి, కొబ్బరికాయ కోటి నమస్కరించాలి.


ఉత్తమమైనది ఉత్థాన ఏకాదశి
       ఈ కార్తీకమాసం లో అత్యంత విశేషమైనది ఉత్థానఏకాదశి. అంటే శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధఎకాదశి నాడు యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొన్న రోజుకే 'ఉత్థాన ఏకాదశి' అని పేరు.


విశిష్ట ఫలప్రదం తులసీ కల్యాణం
      క్షీరాబ్ది ద్వాదశి నాడు ముప్పైరెండు మంది దేవతలలో శ్రీమహాలక్ష్మీ సమేతుడై స్వామీ తులసీ ధాత్రి వనం లో ఉంటాడని చెప్తారు. పూర్వం కృతయుగం లో దేవదానవులు క్షీరమదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు ఒచ్చింది. పాల సముద్రాన్ని చిలికిన కారణం గా 'చిల్కు ద్వాదశి' అనికూడా పిలుస్తారు. స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) దగ్గర విశేష దీపారాదనలు చేసి షోడశోపచారాలతో తులసీ కళ్యాణం జరిపి, లక్ష్మీనారాయణులను పూజిస్తారు.

సోమవారానికి ఎందుకంత ప్రాధాన్యత...?
కార్తికంలో సోమవారానికి ఎనలేని ప్రాధాన్యతఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూరుడై ఈ నక్షత్రంమీద ఉండటం చేత సోమవారాలకు విశిష్టత కలిగింది. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. అదీగాక సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. అందుకే భక్తులు ఈ మాసంలో సోమవారాలలో భక్తిశ్రద్ధలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ‘హరహరశంభో’ అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి సాగరంలో ఓలలాడతారు. సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించడం వల్ల సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో, ఆనందోత్సాహాలతో వర్థిల్లుతారని విశ్వాసం.












స్నానం.. దానం.. దీపం.. ఉపవాసం...
తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. ఆధ్యాత్మిక ఆరోగ్యవాసం: పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసి - శిఖరం లేక గోపుర ద్వారం వద్ద నేతితో గానీ, మంచి నూనెతోగానీ - ఇప్ప - నారింజ నూనెతో గానీ దీపారాధన చేయాలి. శివారాధన ముఖ్యమైనది. ఈ మాసంలో పగటి పూట వేడి - రాత్రి చల్లదనం ఉంటాయి. వాత-పైత్య-శ్లేష్మాలు వస్తాయి. అందువలన ఒక్క పొద్దు భోజనం శ్రేష్ఠం. వీటిని చాదస్తంగా భావించక ఆరోగ్యపరంగా ఆలోచించాలి. దీర్ఘవ్యాధుల నివారణలో ఉపవాసం తిరుగులేని మందు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికరంగా ఆలోచనలో, ఆవేశాలపరంగా సమతౌల్యం సాధించడానికి ఉపవాస నిర్ణయం ఎంతో గొప్పది. ఉపవాసంలో స్వల్పంగా ఆహారం-నీరు-తీసుకుంటే మనస్సు స్థిరంగా ఉంటుంది. దైవం పట్ల స్థిరచిత్తం ఏర్పడుతుంది. ‘ఉప’ అంటే దగ్గరలో, వాసం అంటే ఉండడం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, సాత్త్వికాహారం, మితాహారం-దైవార్పితం చేసి తీసుకోవాలి. న్యాయార్జితాహారం పొందాలని శాస్త్రం. వృద్ధులకు, రోగులకు మినహాయింపు: వృద్ధులు - మానసిక - మెదడు వ్యాధిగ్రస్థులు - గర్భిణులు- క్షయరోగులు - మధుమేహగ్రస్థులు - క్రీడాకారులు ఉపవాసం చేయరాదు. శాస్త్రప్రకారం వారికి మినహాయింపు ఉంది. శరదృతువు ఇది. బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం చేస్తే మంచిది. ప్రవాహస్నానం పవిత్రం. దైవధ్యానం జపం - గ్రంథపఠనం - పురాణాలు చదవడం - వినడం చేయాలి. వృక్షారాధనం విశేషం: అశ్వత్థం విష్ణురూపం - వటవృక్షం రుద్రరూపం. పలాశ వృక్షం బ్రహ్మరూపం. అశ్వత్థ వృక్షాన్ని (రావి చెట్టును) ఆశ్రయించి ఉండమని విష్ణువు లక్ష్మీదేవిని ఆదేశించాడు. రావి చెట్టు శీతల గుణం కలిగి ఉంటుంది. పైత్య దోషాన్ని నివారిస్తుంది. స్త్రీలు ఈ మాసంలో తులసిని పూజించి దీపాలు వెలిగించాలి. తులసిమూలంలో సర్వతీర్థాలు - మధ్యకాండంలో దేవతలు - చివుళ్ళలో సర్వవేదాలూ ఉన్నాయని శాస్త్రవచనం. విష్ణు పత్ని తులసి మాత పూజ పాపాలను హరించి, ధర్మార్థ, కామమోక్షాలు కలిగిస్తుంది. దీపారాధనం.. మోక్షకరం: ఈ మాసం అంతా శివాలయాలలో ఆకాశ దీపాలు వెలిగించాలి. దీపదానం చేయాలి. నదీ ప్రవాహాలలో దీపాలు వెలిగించి వదలాలి. శివ కేశవుల ప్రీతి కోసం దీపదానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ॥ దీపారాధన చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. జ్ఞానవ్యాప్తికి - వితరణకు సంకేతం. వాతావరణం తేమగా ఉండి క్రిమికీటకాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి, దీపం వెలిగించడం వల్ల అవి నశిస్తాయి. వాతావరణం శుభ్రం అవుతుంది. జ్ఞానాన్ని వితరణ చేయడం దీపదానంలోని విశిష్టత. ప్రమిదలో వత్తులు వేసి - నువ్వుల నూనె వేసి తాళ్ల సాయంతో దీపాలు వెలిగించమే ఆకాశదీపం. విశిష్టమైన వనభోజనాలు: కార్తీకమాసంలో వన భోజనాలకు ఎంతో విశిష్టత ఉంది. వన భోజనాలు శాస్త్రీయమైనవి. ఉసిరిచెట్టు నీడన, పనస ఆకులో భోజనం చేయాలి. ఉసిరిని ఔషధీ భాషలో ‘ధాత్రి’ అంటారు. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రక దేహి మహాప్రాజ్ఞే యవోదేహి బలం చ మే ॥ ఉసిరి చెట్టు క్రింద చిత్రాన్నాలు చేసుకొని హరికి నివేదించి, పండిత భోజనం చేయించాలి. బంధువులతో కలిసి భుజించడం వల్ల మహాఫలం లభిస్తుంది. దేవతలు-ఋషులు-సర్వతీర్థాలు అచటనే ఉంటాయని, ఈ మాసంలోనే హరి జాగరణ చేయాలని శాస్త్రం. ఈ కార్తిక మాసంలో శివ - విష్ణ్వాలయదర్శనాలు చేయాలి. అవిలేని చోట ఇతర దేవాలయాల్లో రావి చెట్టు మొదట - తులసి వనంలో విష్ణుచరితలు పాడాలి. దేవపూజ ప్రశస్తం. దీప దానం చేయాలి. తులసి మంజరులచే హరిహరులను అర్చిస్తే ముక్తి లభిస్తుంది. తులసిచే అలంకృతమైన గృహానికి యమకింకరులు కూడా రాలేరనీ తులసీ మాహాత్మ్యం తెలుపుతుంది. ఈ మాసంలో మంత్ర దీక్ష జన్మరాహిత్యం కలిగిస్తుంది. ఈ నెలలో విష్ణువు దామోదర నామంతో పూజింపబడతాడు గాన సంకల్పంలో ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం’ అని చెబుతారు. అన్ని దానాలు ఒక వైపు, దీపదానం ఒక వైపు అని శాస్త్రం. ‘ఏకతస్సర్వదాని - దీపదానం తథైకతః’ అని శాస్త్రవచనం. ఉసిరికాయపై వత్తిని పెట్టి వెలిగించడం విష్ణువుకు ప్రీతికరం. వేకువనే విష్ణు-శివ-గంగ-సూర్యదేవతల ఉపాసన చేయాలి. శివాయ విష్ణురూపాయ - శివరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధయే - వాసిష్ఠాయ నమోన్నమః ॥ క్షీరాబ్ధికన్నియకు...శ్రీ మహావిష్ణువుకు... ఈ మాసంలోనే క్షీరాబ్ధి ద్వాదశి. అదే కార్తిక శుద్ధ ద్వాదశి. ఆ రోజు క్షీరసాగరశయనుడైన విష్ణువు లక్ష్మీయుతుడై తులసి వనానికి వస్తాడని చెబుతాడు. బృందావనంలో సంచరించే విష్ణువు భోగభోగ్యాలనందిస్తాడు. ఈ మాసంలో శివార్చన - అభిషేకం - ఉపవాసం - సాయంపూజ అన్నాదుల నివేదన నక్షత్ర దర్శనం ఎంతో పుణ్యప్రదం. భగినీ హస్తభోజనం... ఈ నెలలోనే యమ విదియ. ఆ రోజున సోదరి చేతివంట తినడమే భగినీ హస్తభోజనం. గోష్టాష్టమి రోజున గోవులను పూజించి ప్రదక్షిణం చేయాలి. శివదీక్షలు - విష్ణు ఆరాధనలకు కార్తిక మాసం పుణ్యఫల మాసంగా చరిత్రలో ప్రసిద్ధమైన కలిజనులకు భక్తినీ ముక్తినీ ప్రాప్తింపజేస్తుంది. కార్తిక పురాణం పఠనం చేయాలి. - పి.వి.బి. సీతారామమూర్తి టాగ్లు: ఆధ్యాత్మిక కథ, భోజనం, రావి చెట్టు, Spiritual story, Meal, Birch tree





1 comment:

  1. There is no pdf of Karthika puranam to o download please make a note n update it soon

    ReplyDelete

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list